రైతులకు సాయం చేసిన పోలీసులు.. వరిపంట తడిసిపోకుండా..?

సెల్వి
మంగళవారం, 14 మే 2024 (16:47 IST)
Police
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌లో లోక్ సభ ఎన్నికల కోసం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర స్థాయి, స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. 
 
అయితే పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్‌లో రైతులు వరి ధాన్యాన్ని నిల్వ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో వరిపంట తడిసిపోకుండా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు రైతుల కష్టాలను గమనించారు. 
 
పోలీసులు వెంటనే వారి వద్దకు వెళ్లి ధాన్యం తడిసిపోకుండా రైతులకు సహకరించారు. పోలీసుల మానవత్వాన్ని అక్కడి ప్రజలంతా మెచ్చుకున్నారు. అనంతరం రైతులు పోలీసులకు చేతులు జోడించి నమస్కరించారు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారంతా సెల్యూట్ పోలీస్ అంటూ సోషల్ మీడియాలో పోలీసుల సహాయాన్ని కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments