Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు సాయం చేసిన పోలీసులు.. వరిపంట తడిసిపోకుండా..?

సెల్వి
మంగళవారం, 14 మే 2024 (16:47 IST)
Police
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌లో లోక్ సభ ఎన్నికల కోసం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర స్థాయి, స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. 
 
అయితే పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్‌లో రైతులు వరి ధాన్యాన్ని నిల్వ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో వరిపంట తడిసిపోకుండా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు రైతుల కష్టాలను గమనించారు. 
 
పోలీసులు వెంటనే వారి వద్దకు వెళ్లి ధాన్యం తడిసిపోకుండా రైతులకు సహకరించారు. పోలీసుల మానవత్వాన్ని అక్కడి ప్రజలంతా మెచ్చుకున్నారు. అనంతరం రైతులు పోలీసులకు చేతులు జోడించి నమస్కరించారు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారంతా సెల్యూట్ పోలీస్ అంటూ సోషల్ మీడియాలో పోలీసుల సహాయాన్ని కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments