Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలోని ఆ రెండు గ్రామాల్లో 100 శాతం పోలింగ్..!!

voting

ఠాగూర్

, మంగళవారం, 14 మే 2024 (10:24 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఈ దశలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. అయితే, తెలంగాణాలోని రెండు గ్రామాల్లో ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. అక్కడి ఓటర్లు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొల్వాయిలో వంద శాతం పోలింగ్ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఇలా వంద శాతం ఓటింగ్‌కు కృషి చేసిన సెక్టోరల్ ఆఫీసర్ శక్రు నాయక్, కార్యదర్శి ముద్దం విజయ, బీఎల్వో యశోద, రూట్ అధికారి రాజ్‌కుమార్‌ను కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రత్యేకంగా అభినందించారు. 
 
అలాగే, మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన 62ఏ అదనపు పోలింగ్ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఉన్నారు. దంతో సంగాయిపేట తండా వాసులను మెదక్ జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇదిలావుంటే, తెలంగాణాలో సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. గ్రామీణ తెలంగాణాలో పోలింగ్ శాతం దాదాపు 70 శాతానికి పైగా నమోదైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైకిల్ స్పీడుకి సైకో పోతాడు, భారీ విజయం దిశగా NDA కూటమి, తెదేపా అంచనాలు