Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో అధికారులు జులుం.. పన్ను కట్టలేదని ఇంటికి తాళం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (08:39 IST)
పిఠాపురం మున్సిపల్ అధికారులే స్వయంగా ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంటి పన్ను కట్టలేదని తమ జులుం ప్రదర్శించారు. ఇంట్లో మహిళలు ఉండగానే ఇంటికి తాళం వేశారు. ఆ తర్వాత మహిళలు గొడవకు దిగడంతో సిబ్బంది వచ్చి ఇంటి తాళం తీశారు. మునిసిపల్ అధికారులు వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని, అదికూడా తమ పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. 
 
పిఠాపురం పట్టణంలోని మోహన్ నగరులో ఇంటి పన్ను వసూళ్లకు వెళ్ళిన మున్సిపల్ అధికారులు గొర్రెల సత్తిబాబు, రమణల ఇంటికి తాళం వేశారు. పన్ను చెల్లించని కారణంగా వారిళ్ళకు తాళం వేసి నోటీసులు అంటించారు. ఇంట్లో మహిళలు ఉండగానే గేటుకు తాళాలు వేశారు. సత్తిబాబు ఇంట్లోని మహిళలు ఆందోళనకు దిగడంతో తాళాలు తొలగించారు. సత్తిబాబు ఇంటికి వేసిన సీలును మాత్రం అలానే ఉంచి వెళ్లిపోయారు. 
 
దీనిపై సత్తిబాబు మాట్లాడుతూ, సాధారణంగా తనకు ఎపుడూ రూ.1600 మాత్రమే ఇంటి పన్ను వచ్చేదన్నారు. కానీ ఈ దఫా రూ.6400 వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను చెల్లించేందుకు తనకు గడువు ఇవ్వాలని కోరినా వారు ఏమాత్రం వినిపించుకోలేదని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments