Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో అధికారులు జులుం.. పన్ను కట్టలేదని ఇంటికి తాళం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (08:39 IST)
పిఠాపురం మున్సిపల్ అధికారులే స్వయంగా ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంటి పన్ను కట్టలేదని తమ జులుం ప్రదర్శించారు. ఇంట్లో మహిళలు ఉండగానే ఇంటికి తాళం వేశారు. ఆ తర్వాత మహిళలు గొడవకు దిగడంతో సిబ్బంది వచ్చి ఇంటి తాళం తీశారు. మునిసిపల్ అధికారులు వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని, అదికూడా తమ పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. 
 
పిఠాపురం పట్టణంలోని మోహన్ నగరులో ఇంటి పన్ను వసూళ్లకు వెళ్ళిన మున్సిపల్ అధికారులు గొర్రెల సత్తిబాబు, రమణల ఇంటికి తాళం వేశారు. పన్ను చెల్లించని కారణంగా వారిళ్ళకు తాళం వేసి నోటీసులు అంటించారు. ఇంట్లో మహిళలు ఉండగానే గేటుకు తాళాలు వేశారు. సత్తిబాబు ఇంట్లోని మహిళలు ఆందోళనకు దిగడంతో తాళాలు తొలగించారు. సత్తిబాబు ఇంటికి వేసిన సీలును మాత్రం అలానే ఉంచి వెళ్లిపోయారు. 
 
దీనిపై సత్తిబాబు మాట్లాడుతూ, సాధారణంగా తనకు ఎపుడూ రూ.1600 మాత్రమే ఇంటి పన్ను వచ్చేదన్నారు. కానీ ఈ దఫా రూ.6400 వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను చెల్లించేందుకు తనకు గడువు ఇవ్వాలని కోరినా వారు ఏమాత్రం వినిపించుకోలేదని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments