Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరల్ ఫీవర్ బారిన పడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. ఫ్యామిలీ కూడా..?

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (21:58 IST)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే పవన్ కూడా జ్వరంతో బాధపడుతున్నారు. పవన్ కల్యాణ్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. 
 
వైరల్ జ్వరంతో ఆయన అనారోగ్య బారిన పడ్డారు. జ్వరం వున్నప్పటికీ ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తన నివాసంలోనే సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
కాగా, వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నెలకొనేలా కృషి చేయాలని... అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని, దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
 
ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్‎లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఏకధాటిగా వానలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. వరద బాధితులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా ఉండి ధైర్యం చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments