Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరద బాధితుల కోసం పవన్, నారా భువనేశ్వరి, మహేష్‌ల విరాళాలు

Advertiesment
Nara Bhuvaneshwari

సెల్వి

, బుధవారం, 4 సెప్టెంబరు 2024 (07:56 IST)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి రూ.1 కోటి విరాళం అందిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 
 
అలాగే భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌ల‌తో మునిగిన రెండు తెలుగు రాష్ట్రాల కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రూ. 2కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ తరఫున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. కోటి చొప్పున విరాళం ఇస్తున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించారు. 
 
మరోవైపు తెలుగు సినీ సెలబ్రిటీలు భారీ ఆర్థిక విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా చేరారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆయన రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలు.. గాలి జనార్ధన్ రెడ్డికి షాక్