Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు రైల్వే ట్రాక్‌పై ఉండ‌గానే దూసుకొచ్చిన ట్రైన్... తప్పిన ప్రమాదం (Video)

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (19:58 IST)
విజయవాడ పరిధిలోని మధురానగర్‌లో వరద ముంపు ప్రాంతాల్లో గురువారం కూడా ముమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వరదను పరిశీలించేందుకు రైలు వంతెనపైకి సీఎం వెళ్లారు. వంతెనపై నడిచి బుడమేరు ఉధృతిని చంద్రబాబు పరిశీలించారు. రైలు వంతెనపై ఆయన నడుస్తుండగానే రైలు ఎదురుగా రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. 
 
వెంటనే సీఎం దృష్టికి రైలు వస్తున్న విషయం చెప్పారు. ఆ వెంటనే ఆయన పక్కకు తప్పుకున్నారు. అయితే, రైలు మాత్రం చంద్రబాబుకు అతి సమీపంగా రైలు వెళ్లింది. రైలు తగలకుండా సీఎం ఓ పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రైలు వెళ్లిపోయాక అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments