Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను చూసి నేర్చుకోండి : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (17:11 IST)
మాతృభాషను ఏ విధంగా పరిరక్షించుకోవాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‍ను చూసి నేర్చుకోవాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న వైసీపీ సర్కారు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. 
 
స్కూళ్లలో తెలుగు మీడియం నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తుంటే అధికార భాషా సంఘం ఏంచేస్తోందని నిలదీశారు. మాతృభాషను ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలంటూ ఏపీ పాలకులకు హితవు పలికారు. 
 
తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ పరిరక్షించుకుంటున్న వైనం వైసీపీ నాయకత్వానికి ఓ పాఠం వంటిదన్నారు. మాతృభాష మనుగడ కోసం 2017 తెలుగు మహాసభల్లో 'తొలి పొద్దు' పేరుతో 442 మంది కవులు రాసిన రచనలతో ఓ పుస్తకం కూడా విడుదల చేశారని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
 
అలాగే, ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తనదైనశైలిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను 2003లో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో మూడు నిమిషాల పాటు ఒక్క ఇంగ్లీషు పదం కూడా దొర్లకుండా మాట్లాడాలని పోటీ పెట్టానని, ఈ పోటీలో ఏపీలోని ఏ ప్రాంతంలో కూడా ఒక్కరు కూడా గెలవలేకపోయారని వెల్లడించారు. ఈ నిజాన్ని తాను ఎవరి కళ్లలోకి చూసి చెప్పమన్నా చెబుతానని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments