Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను చూసి నేర్చుకోండి : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (17:11 IST)
మాతృభాషను ఏ విధంగా పరిరక్షించుకోవాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‍ను చూసి నేర్చుకోవాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న వైసీపీ సర్కారు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. 
 
స్కూళ్లలో తెలుగు మీడియం నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తుంటే అధికార భాషా సంఘం ఏంచేస్తోందని నిలదీశారు. మాతృభాషను ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలంటూ ఏపీ పాలకులకు హితవు పలికారు. 
 
తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ పరిరక్షించుకుంటున్న వైనం వైసీపీ నాయకత్వానికి ఓ పాఠం వంటిదన్నారు. మాతృభాష మనుగడ కోసం 2017 తెలుగు మహాసభల్లో 'తొలి పొద్దు' పేరుతో 442 మంది కవులు రాసిన రచనలతో ఓ పుస్తకం కూడా విడుదల చేశారని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
 
అలాగే, ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తనదైనశైలిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను 2003లో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో మూడు నిమిషాల పాటు ఒక్క ఇంగ్లీషు పదం కూడా దొర్లకుండా మాట్లాడాలని పోటీ పెట్టానని, ఈ పోటీలో ఏపీలోని ఏ ప్రాంతంలో కూడా ఒక్కరు కూడా గెలవలేకపోయారని వెల్లడించారు. ఈ నిజాన్ని తాను ఎవరి కళ్లలోకి చూసి చెప్పమన్నా చెబుతానని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments