Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం... చీపుర్లతో కొట్టించుకున్న సంగతి మోహన్ బాబు మరిచిపోయారు...

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:23 IST)
ఇటీవల వైకాపాలో చేరిన సినీ నటుడు మోహన్ బాబుపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఘాటు విమర్శలు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని మోహన్ బాబు విమర్శలు చేయడం సిగ్గుగా ఉందన్నారు. మోహన్ బాబు ఇపుడు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారని, లక్ష్మీపార్వతి అయితే ఆయన గురించి సరిగ్గా చెబుతారన్నారు. 
 
పాతికేళ్ల కిత్రం నిమ్స్‌ ఆస్పత్రి సిబ్బందితో మోహన్ బాబు అసభ్యంగా ప్రవర్తిస్తే చీపుర్లతో తరిమికొట్టిన విషయం మోహన్ బాబు మరిచిపోయినట్టుగా ఉన్నారన్నారు. మోహన్ బాబు గతంలో ఓ ఎయిర్ హోస్టెస్‌తోనూ అసభ్యంగా ప్రవర్తించారని అనురాధ ఆరోపించారు. అంతేకాకుండా, ఆయన కొడుకు లవ్ స్టోరీని ఓ టీవీ చానల్ ప్రసారం చేస్తే తుపాకీతో బెదిరించింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. 
 
కాగా, ఇటీవల తన విద్యా సంస్థల్లో పని చేస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు నడిరోడ్డుపై పడుకుని ధర్నా చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబుపై వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments