Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం... చీపుర్లతో కొట్టించుకున్న సంగతి మోహన్ బాబు మరిచిపోయారు...

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:23 IST)
ఇటీవల వైకాపాలో చేరిన సినీ నటుడు మోహన్ బాబుపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఘాటు విమర్శలు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని మోహన్ బాబు విమర్శలు చేయడం సిగ్గుగా ఉందన్నారు. మోహన్ బాబు ఇపుడు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారని, లక్ష్మీపార్వతి అయితే ఆయన గురించి సరిగ్గా చెబుతారన్నారు. 
 
పాతికేళ్ల కిత్రం నిమ్స్‌ ఆస్పత్రి సిబ్బందితో మోహన్ బాబు అసభ్యంగా ప్రవర్తిస్తే చీపుర్లతో తరిమికొట్టిన విషయం మోహన్ బాబు మరిచిపోయినట్టుగా ఉన్నారన్నారు. మోహన్ బాబు గతంలో ఓ ఎయిర్ హోస్టెస్‌తోనూ అసభ్యంగా ప్రవర్తించారని అనురాధ ఆరోపించారు. అంతేకాకుండా, ఆయన కొడుకు లవ్ స్టోరీని ఓ టీవీ చానల్ ప్రసారం చేస్తే తుపాకీతో బెదిరించింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. 
 
కాగా, ఇటీవల తన విద్యా సంస్థల్లో పని చేస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు నడిరోడ్డుపై పడుకుని ధర్నా చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబుపై వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments