Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఎంపీ కాస్త తేడా : వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (22:07 IST)
సొంత పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. మా ఎంపీ కాస్త తేడా అంటూ ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. 
 
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వ యేడాది పాలనపై రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. ఇవి తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆయనకు షోకాజ్ నోటీసు పంపాలని వైకాపా పెద్దలు భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ, ఆయన ఒక తేడా మనిషని చెప్పారు. ఆయన ఎప్పుడూ అలాగే మాట్లాడతారని... ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
 
ఇకపోతే, జగన్మోహన్ రెడ్డికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు కూడా అంబటి రాంబాబు ఘాటుగా కౌంటరిచ్చారు. జగన్‌ను విమర్శించే అర్హత లోకేశ్‌కు లేదని అన్నారు. 
 
చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ అల్లుడిగా తప్ప లోకేశ్‌కు ఇతర అర్హత ఏముందని ప్రశ్నించారు. డైలాగులు మాట్లాడటం కాదని, దమ్ముండాలని అన్నారు. రాజారెడ్డి మీసంలోని వెంట్రుకకు కూడా లోకేశ్ సరిపోడని చెప్పారు. వడ్డీతో సహా లోకేశ్ ఏం చెల్లిస్తాడని ప్రశ్నించిన అంబటి... హెరిటేజ్ కంపెనీలో అప్పు చెల్లిస్తాడా? అని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments