Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణిగుంట రైల్వేస్టేషన్‌ నుంచి ఉత్తర,దక్షిణ భారత యాత్రలు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:48 IST)
ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో రేణిగుంట రైల్వేస్టేషన్‌ నుంచి ఉత్తర, దక్షిణ భారత యాత్రలను నిర్వహిస్తోంది. ఉత్తర భారత యాత్ర: రేణిగుంటలో ఏప్రిల్‌ 24న ఉదయం బయలు దేరి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, ఖాజీపేట, రామగుండం రైల్వేస్టేషన్లలో ఆగి పర్యాటకులను ఎక్కించుకుంటారు. అక్కడ నుంచి బయలు దేరి 26న ఉదయానికి ఆగ్రా చేరుకుని తాజ్‌మహల్‌ను దర్శించుకుంటారు.

తదనంతరం మధురకు చేరుకుని కృష్ణజన్మభూమిని చూస్తారు. అక్కడనుంచి జమ్ము-కశ్మీర్‌లోని కట్రాచేరుకుంటారు. 28న ఉదయం వైష్ణవిదేవి ఆలయాన్ని దర్శించుకుని ఇతర ఆలయాలను స్వంత ఖర్చులతో చూస్తారు. కట్రాలో బయలు దేరి జలంధర్‌, అమృతసర్‌, గోల్డన్‌టెంపుల్‌, వాగా బార్డర్‌లను దర్శిస్తారు.

30న ఉదయం హరిద్వార్‌ చేరుకుని అక్కడ మానసదేవి మందిర్‌, గంగాహారతి చూసుకుని ఒకటన డిల్లీ చేరుకుంటారు. అదేరోజు, మరుసటి రోజు డిల్లీలో ఎర్రకోట, రాజ్‌ఘాట్‌, ఇందిరామెమోరియల్‌, అక్షరధామం,కుతుబ్‌మీనార్‌, ఇందిరాఘాట్‌,అనంతరం అదేరాత్రి బయలు దేరి తిరుగు ప్రయాణం చేస్తూ 4న రాత్రికి రేణిగుంటకు చేరుకుంటారు. ఈ యాత్రకు స్లీపర్‌ క్లాస్‌ ధర రూ 10,400లు, థర్డ్‌ఏసీ ధర రూ 13,330
 
దక్షిణభారత యాత్ర :ఈ యాత్ర మే 11వ తేదీ ఉదయం సికింద్రాబాద్‌లో బయలు దేరి వరంగల్‌, ఖమ్మం, విజయవాడ,తెనాలి,ఒంగోలు ,నెల్లూరు, గూడూరు మీదుగా రేణిగుంటకు అదేరాత్రి చేరుకుంటుంది. ఇక్కడ పర్యాటకులను ఎక్కించుకుని 12న ఉదయానికి తిరుచానాపల్లి చేరుకుని ఆలయాలు దర్శించుకుంటారు.

13న రామేశ్వరం చేరుకుంటారు. 22 బావుల తీర్థాలు, సముద్రతీరం, తిలకించి మధురైకి చేరుకుంటారు. అక్కడ మధురమీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. 14న ఉదయం నాగూర్‌కోయిల్‌ చేరుకుని అక్కడనుంచి కన్యాకుమారి అమ్మాల్‌గుడి, వివేకానందరాక్‌లను దర్శించుకుంటారు.

15న నాగూర్‌కోయిల్‌లో బయలు దేరి చెంగల్‌పట్టు చేరుకుంటారు. 16న మహాబలిపురం ,కంచికామాక్షమ్మ ఆలయాలను దర్శించుకుంటారు. 17న ఉదయం బయలు దేరి రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడ నుంచి సికింద్రాబాద్‌ చేరుకుంటారు.

ఈ యాత్రలో సీపర్‌ క్లాస్‌కు రూ 6,620లు, థర్డ్‌ ఏసీ రూ 11,030లుగా టిక్కెట్‌ ధరలు నిర్ణయించారు. 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకు పెద్దల చార్జీనే వర్తిస్తుంది. పూర్తి వివరాలకు 8287932313, 8287932317,7670908221 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments