Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యంతో జ్యోతుల నెహ్రూ : వైకాపా ఎంపీ వీడియో కాల్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (15:27 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పలువురు నేతలు, ప్రముఖులు పరామర్శిస్తున్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ నేతలు కూడా ఉన్నారు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నెహ్రూను మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డిలు పరామర్శించారు. అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఆయనకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. 
 
ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా చాలా మంది టీడీపీ నేతలు ఆస్పత్రికి వెళ్లి నెహ్రూను పరామర్శించారు. అయితే.. ఆయన వద్దకు వైఎస్సార్ సీపీ నేతలు చర్చనీయంగా మారింది. 
 
కాగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం జ్యోతుల నెహ్రూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నెహ్రూ ఆరోగ్య పరిస్థితిపై అధినేత చంద్రబాబు ఆరా తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments