Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన వ్యక్తి.. ఏడుపు శబ్ధం విని లేచి కూర్చున్నాడు.. కానీ కొంతసేపట్లో?

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (14:49 IST)
ఏడుపు శబ్ధం విని ఆ శవం కన్ను తెరిచింది. కానీ అందరూ షాక్ కావడంతో పాటు సంతోషంతో పండుగ చేసుకునేలోపు.. తిరిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలంలోని దర్యాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 49 ఏళ్ల లింగన్న అనే వ్యక్తి చాలా సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. 
 
శుక్రవారం ఉదయం ఎంతసేపూ లేపినా లేవలేదు. దీంతో అతడు మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు విదేశాల్లో వున్న కుమారుడికి సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులంతా చేరడంతో ఆ ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. గంటల తరబడి ఏడిచి, ఏడిచి అలిసిపోయిన క్షణంలో ఒక్కసారిగా కళ్లు తెరిచాడు లింగన్న. నిద్రలోంచి లేచినట్టుగా లేచాడు. 
 
చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చోవడంతో అందరూ హ్యాపీగా పండగ చేసుకున్నారు. ఎలాగో కుటుంబసభ్యులు, బంధువులు రావడంతో సంతోషంగా లింగన్నతో కలిసి మాట్లాడుతూ కాలక్షేపం చేశారు. అంతలోనే లింగన్న మళ్లీ కన్నుమూశాడు. చివరికి చేసేది లేక కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments