Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన వ్యక్తి.. ఏడుపు శబ్ధం విని లేచి కూర్చున్నాడు.. కానీ కొంతసేపట్లో?

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (14:49 IST)
ఏడుపు శబ్ధం విని ఆ శవం కన్ను తెరిచింది. కానీ అందరూ షాక్ కావడంతో పాటు సంతోషంతో పండుగ చేసుకునేలోపు.. తిరిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలంలోని దర్యాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 49 ఏళ్ల లింగన్న అనే వ్యక్తి చాలా సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. 
 
శుక్రవారం ఉదయం ఎంతసేపూ లేపినా లేవలేదు. దీంతో అతడు మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు విదేశాల్లో వున్న కుమారుడికి సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులంతా చేరడంతో ఆ ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. గంటల తరబడి ఏడిచి, ఏడిచి అలిసిపోయిన క్షణంలో ఒక్కసారిగా కళ్లు తెరిచాడు లింగన్న. నిద్రలోంచి లేచినట్టుగా లేచాడు. 
 
చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చోవడంతో అందరూ హ్యాపీగా పండగ చేసుకున్నారు. ఎలాగో కుటుంబసభ్యులు, బంధువులు రావడంతో సంతోషంగా లింగన్నతో కలిసి మాట్లాడుతూ కాలక్షేపం చేశారు. అంతలోనే లింగన్న మళ్లీ కన్నుమూశాడు. చివరికి చేసేది లేక కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments