Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వై నాట్ 175' : వైకాపాను తొక్కిపట్టి నారతీశాం.. బాలకృష్ణ

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (10:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు తేరుకోలేని షాక్ తగిలింది. ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు పట్టం కట్టారు. మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. శుక్రవారమే రెండు స్థానాల్లో విజయం ఖరారు కాగా, శనివారం పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. చివరి ఓటు లెక్కింపు వరకు హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు తుది ఫలితంలో వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి 7,543 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఫలితాల వెల్లడి తర్వాత వైకాపా, టీడీపీ మధ్యల యుద్ధం మొదలైంది. ఈ ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని వైకాపా పెద్దలు చెబుతుంటే.. రాష్ట్రంలో మార్పు మొదలైంది. ఫైనల్ ఫలితాల్లోనూ ఇది రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు జోస్యం చెబుతున్నారు. 
 
ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఫలితాలపై స్పందించారు. గతంలో 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తామని జగన్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ వై నాట్ 175 అని ఇపుడు జగన్ చెబుతుంటే వినాలని ఉందన్నారు. ఎమ్మెల్యీ ఎన్నికల్లో వైకాపాను తొక్కిపట్టి నార తీశారని ఆయన తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. పులివెందుల కోటకు బీటలు వారుతున్నాయన్నారు. త్వరలోనే ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్‌కు కూడా చేరుతాయని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments