Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గా అగ్రహారంలో కత్తులతో స్వైర విహారం.. వ్యక్తి మృతి

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. పట్టణంలోని దుర్గా అగ్రహారంలో శుక్రవారం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ఆగంతకుల దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.
 
ఈ హత్య తర్వాత దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా హంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హత్యా ఘటనతో స్థానికంగా ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments