Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసంచారం లేని ప్రదేశాలకు వెళ్లొద్దని ఆడపిల్లలకు చెప్పాలి

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (16:27 IST)
గుంటూరు అర్బన్ ఎస్పీ గారు శ్రీ అరీఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు మొన్న తాడేపల్లిలో మహిళపై జరిగిన అత్యాచార సంఘటన దృష్ట్యా గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో స్పెషల్ పార్టీ పోలీసులను కొన్ని టీమ్‌లుగా ఏర్పాటు చేసి జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాలలో మహిళల భద్రత దృష్ట్యా విస్తృతముగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించడమైనది. గుంటూరు అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ... పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళడం శ్రేయస్కరం కాదని తమ పిల్లలకు తెలియ జేయాలన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో దిశా వాహనం తిరుగుతూ ఉంటుంది, అవసర సమయంలో దిశా మహిళా పోలీస్ సిబ్బంది సహాయం పొందవచ్చని, మహిళలందరు పోలీసులు దిశా చట్టం గురించి మరియు దిశా యాప్ గురించి ప్రతి ఒక్క మహిళలకు కు పూర్తి అవగాహన కల్పించాలని తెలియజేశారు.

ఆపదలో ఉన్న మహిళ ఎవరైనా దిశా యాప్ ద్వారా సహాయం కోరిన వెంటనే సంబంధిత అధికారులు సదరు ప్రదేశానికి వెంటనే చేరుకొని సహాయం చేయాలనీ ఆదేశించారు. మహిళలు అందరూ దిశా యాప్‌ను install చేసుకొని వారికి దగ్గరలో గల మహిళా పోలీస్ స్టేషన్‌కి విషయం తెలియపరచి సంబంధిత దిశా పోలీస్ అధికారు ద్వారా న్యాయం పొందవలసినదిగా తెలియచేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments