Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిల్లీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్ష, ఏపీలో దేవాలయాలపై దాడులకు నిరసనగా

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (18:59 IST)
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్షలు చేపట్టారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడుల పట్ల ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహహరిస్తుందని దేవాలయాలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు దీక్ష చేపట్టారు.
 
దాడులను అరికట్టకపోతే మత సామరస్యం దెబ్బతింటుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. అంతర్వేది రథం దగ్ధంపై పోలీసులు నమ్మశక్యం కాని కారణాలు చెబుతున్నారని విమర్శించారు. ఆలయాలు రక్షణ, ఆస్తుల విషయంలో ప్రభుత్వం నిర్ధిష్టమైన విధానం పాటించాలని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం స్పందించాలని రఘురామ కోరారు.
 
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ తన నివాసంలో దీక్షలో కూర్చున్నారు. దీక్షకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మద్దతు పలికారు. ఆయనకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments