Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క పులి కాదు.. ఒకేసారి నాలుగు పులుపు దాడికి ప్రయత్నిస్తే...?

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (16:41 IST)
ఒక్క పులి కాదు.. ఒకేసారి నాలుగు పులులు దాడికి ప్రయత్నిస్తే.. ఆ పరిస్థితిని ఊహించుకుంటే ప్రాణాలు పోయినట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి పశువుల కాపరులకు ఎదురైంది. అయితే వారు ఏమాత్రం జడుసుకోకుండా వాటిని ప్రతిఘటించారు. వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట బగుళ్ల గుట్ట అటవీప్రాంతంలో మళ్ళీ పెద్ద పులుల కలకలం సృష్టించాయి.
 
పశువుల మందపై ఒకేసారి నాలుగు పెద్దపులులు దాడికి ప్రయత్నించాయి. ఇది గమనించిన పశువుల కాపరులు అప్రమత్తమై భయపడకుండా.. శునకాల సాయంతో వాటిని వెనక్కి తరిమారు. ఆపై వెంటనే గ్రామస్తులకు సమాచారం చేరవేశారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు.. అటవీ ప్రాంతం నుంచి పశువుల కాపరులను క్షేమంగా గ్రామంలోకి తీసుకొచ్చారు. అయితే, పులులకు సంబంధించిన సమాచారం ఫారెస్ట్ అధికారులకు ఇచ్చినా.. వారు స్పందించలేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ అటవీ ప్రాంతంలో తరచూ పులులు పశువులపై దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments