Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యశీలాన్ని శంకించాడు ఓ భర్త.. ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు.. భార్య బతికిపోయింది..

సెల్వి
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (15:42 IST)
భార్యశీలాన్ని శంకించాడు ఓ భర్త. అంతటితో ఆగకుండా తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సేలం, ఆత్తూరు సమీపం, కృష్ణాపురం గ్రామంలో భార్యశీలాన్ని శంకించాడు. తన ఇద్దరు పిల్లను కత్తితో హత్య చేశాడు. 
 
అంతటితో ఆగకుండా భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణాపురంలో అశోక్‌కుమార్‌ (42), తవమణి (38) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి విద్యారాణి (13), అరుళ్‌కుమారి (13) అనే ఇద్దరు కుమార్తెలు, అరుళ్‌ ప్రకాష్‌ (5) అనే కుమారుడున్నాడు. తాగుడుకు అలవాటు పడిన అశోక్‌కుమార్‌ భార్యను అనుమానించేవాడు. తవమణి శీలాన్ని శంకిస్తూ కొడుకు తనకు పుట్టలేదంటూ తవమణితో గొడవపెట్టుకున్నాడు. 
 
బుధవారం ఉదయం మరింత తాగి ఇంటికి చేరుకున్న అశోక్‌కుమార్‌ వేటకొడవలితో నిదురపోతున్న భార్యా, ముగ్గురు పిల్లలపై దాడి జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యారాణి, అరుళ్‌ ప్రకాష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తవమణి, అరుళ్‌కుమారి తీవ్రంగా గాయపడ్డారు. 
 
నలుగురు మృతి చెందారని అనుకున్న అశోక్‌కుమార్‌ వేటకొడవలితోనే పక్కింటో దూరాడు. అతడిని చూసిన ఆ ఇంటిలోనివారు కేకలు వేశారు. పక్కింటివారు భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్యాణ్‌రామ్‌ మెరుపు చిత్రం పాటలో పాల్గొన్న విజయశాంతి - తాజా అప్ డేట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments