Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతోషంగా దీపావ‌ళి చేసుకుని... కూలి పనికెళ్తుంటే...

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (10:38 IST)
సంతోషంగా దీపావ‌ళి పండగ చేసుకుని మునుపటిలాగే కూలి పనికెళ్తున్న ఆ ఆరుగురి కుటుంబాల్లో ఓ గుర్తు తెలియని వాహనం యమపాశమై పెనువిషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లాలో దీపావళి మరుసటి రోజు ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
 
 
పామిడి సమీపంలో 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగులు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్రగాయాల‌పాల‌య్యారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు పోలీసులు, స్థానికులు.  వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో చనిపోయిన వారు, గాయపడిన వారంతా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన వారని గుర్తించారు. 
         
 
స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, లారీ ఢీ కొన్న సంఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్ మద్యం మత్తులో ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments