Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతోషంగా దీపావ‌ళి చేసుకుని... కూలి పనికెళ్తుంటే...

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (10:38 IST)
సంతోషంగా దీపావ‌ళి పండగ చేసుకుని మునుపటిలాగే కూలి పనికెళ్తున్న ఆ ఆరుగురి కుటుంబాల్లో ఓ గుర్తు తెలియని వాహనం యమపాశమై పెనువిషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లాలో దీపావళి మరుసటి రోజు ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
 
 
పామిడి సమీపంలో 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగులు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్రగాయాల‌పాల‌య్యారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు పోలీసులు, స్థానికులు.  వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో చనిపోయిన వారు, గాయపడిన వారంతా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన వారని గుర్తించారు. 
         
 
స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, లారీ ఢీ కొన్న సంఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్ మద్యం మత్తులో ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments