జగన్ కోసం 800 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (07:57 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం ఒక అభిమాని ఏకంగా 800 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుకుంటూ తాడేపల్లికి వచ్చారు. జగన్‌పై విపరీతమైన అభిమానం పెంచుకున్న మహారాష్ట్ర రైతు షోలాపూర్ జిల్లా నుంచి సైకిల్ తొక్కుకుంటూ తాడేపల్లికి చేరుకున్నాడు. ఆయనను సీఎం జగన్ ఆప్యాయంగా స్వాగతించి ఫోటోలు దిగారు. ఆ రైతు పేరు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా వాసి. సీఎం జగన్ అంటే అమితమైన అభిమానం. ఆయన విధానాలు లక్ష్మణ్ కాక్డేకు ఎంతగానో నచ్చాయి. దాంతో సీఎం జగన్‌ను ఎలాగైనా కలవాలని పట్టుదలతో ఈ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. 
 
ఇందుకోసం ఈ నెల 17వ తేదీన మహారాష్ట్రలలోని తన స్వగ్రామం నుంచి బయలుదేరి ఆయన.. 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ తాడేపల్లికి చేరుకున్నాడు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. కాక్డే గురించి విషయం తెలుసుకున్న సీఎం జగన్... ఆ రైతును ఆప్యాయంగా ఆహ్వానించాడు. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు కాక్డే జగన్ బొమ్మ ఉన్న టీషర్టును ధరించివచ్చారు. దానిపై కాబోయే ప్రధాని జగన్ అని రాసివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments