Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగు పడితే.... విమానం కూలిందంటూ వదంతులు...

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (18:53 IST)
చిత్తూరు, నగరంలోని మహాదేవనాయుడు ఇటుకల ఫ్యాక్టరీ సమీపం లోని గుట్ట(చిత్తూరు  ఏస్టేట్) వద్ద విద్యుత్ హై పవర్ లైన్ పైన పిడుగు పడటంతో అక్కడి కొండపై పేలుడు శబ్దం వచ్చింది. విద్యుత్ తీగ పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విమానం కూలిపోయిందంటూ వదంతులు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
అప్రమత్తమైన పోలీసులు తిరుపతి విమానాశ్రయంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ను సంప్రదించారు. అలాంటి ప్రమాదమేమీ అసలు లేదని వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పిడుగు పాటుకు విద్యుత్ తీగ పడటంతో మంటలు చెలరేగి అక్కడి చెట్లు కాలిపోయి కొద్దిసేపటికే మంటలు ఆరిపోయాయి. 
 
సోషల్ మీడియాలో కొన్ని విషయాల్లో చోటుచేసుకుంటోన్న అవాస్తవ ప్రచారాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ రాజశేఖర్‌ బాబు సూచించారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments