Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా పాలకుల పాపాలే ఇపుడు ఏపీకి శాపాలా? (Video)

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (11:52 IST)
గత ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన పాపాలే ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపాలుగా పరిణమించాయని పలువురు పర్యావరణ నిపుణులు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నది. ఆ సమయంలో వైకాపా నేతలు ప్రకృతితో చెలగాటమాడారు. ఆ పాపాలు ఇపుడు రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయి. 
 
వైకాపా నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. గతంలో జగన్ రెడ్డి ఇసుక మాఫియాకి అన్నమయ్య డ్యాం బలైపోయిందనీ, ఇపుడు జగన్ రెడ్డి ముఠా కబ్జాకి గురైన బుడమేరు వల్ల విజయవాడ మునగటం జరిగిందిని వారు అంటున్నారు. రేపు విశాఖపట్టణం మునిగిపోవడం ఖాయమని అంటున్నారు. దీనికి కారణం గత ఐదేళ్ల వైకాపా పాలనలో విశాఖపట్టణాన్ని మొత్తం వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు. 
 
అధికారాన్ని అడ్డుపెట్టుకున్న వైకాపా నేతలు.. సహజవనరులని, తమ సొంతానికి వాడుకున్నారు. విశాఖ సముద్ర తీరాన్ని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి రాసిచ్చారు. భీమిలి బీచ్ వద్ద, సముద్రాన్ని ఆనుకుని, సాయిరెడ్డి కూతురు భారీ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. కోస్టర్ రెగ్యులేటరీ రీజనల్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను హైకోర్టు ఆదేశాలు ప్రకారం మంగళవారం జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. 
 
హైకోర్టు ఆదేశాలు ప్రకారం, నోటీసు ఇచ్చినా కనీసం లెక్క చేయకుండా స్పందించకపోవటంతో, హైకోర్టు ఆదేశాలు అనుసరించి, సముద్రం ఒడ్డున కట్టిన నిర్మాణాలు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రకృతిని నాశనం చేసిన జగన్ రెడ్డి గ్యాంగ్ పాపాలు, రాష్ట్ర భవిష్యత్తు తరాలకు శాపాలుగా మారాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments