Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూ వివాదం - పెప్పర్ స్ప్రే చల్లి.. కత్తితో కానిస్టేబుల్ దాడి

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (08:59 IST)
పోలీస్ జులుం ప్రదర్శించి పరాయి వ్యక్తి స్థలాన్ని ఆక్రమించుకుని కంచె వేయడమే కాకుండా, తనకు అడ్డు చెప్పిన వారిపై ఒక ఏఆర్ కానిస్టేబుల్ పెప్పర్ స్ప్రే చల్లి.. కత్తితో దాడి చేసిన ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గవరవరంలో జరిగింది. భూముల సరిహద్దు వివాదంలో తాహశీల్దాద్రు సక్షమంలోనే ఏఆర్ కానిస్టేబుల్ ఈ దాడికి తెగబడటం గమనార్హం. 
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. గవరవరం రెవెన్యూ గ్రామ పరిధిలో జి.జగన్నాథపురం గ్రామానికి వెళ్లే దారిలో సర్పంచి చప్పగడ్డి మాణిక్యం కుమార్తె జొన్నపల్లి చిన్నతల్లికి చెందిన సుమారు 45 సెంట్ల భూమి ఉంది. ఇందులోకి ఏఆర్‌ కానిస్టేబుల్‌ వంకల అప్పలనాయుడు ఈమె భూమిలోకి చొచ్చుకొని వచ్చి కంచె వేశారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు తహశీల్దారు తిరుమలబాబు, వీఆర్వో రమణమూర్తి,  సిబ్బంది వెళ్లి ఇరువర్గాలను విచారణ చేశారు.
 
రెవెన్యూ సిబ్బంది భూమి వివరాలు అడుగుతున్న సమయంలో కానిస్టేబుల్‌ పెప్పర్‌ స్ప్రే చల్లి చేతిలో ఉన్న చిన్నపాటి కత్తితో అందివచ్చిన వారినల్లా గాయపరిచి హల్‌చల్‌ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలకు చెందిన 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
చప్పగడ్డి దేముడునాయుడు ఫిర్యాదు మేరకు వంకల అప్పలనాయుడు, ఉప్పల అప్పారావు, లక్ష్మణ, నాగరాజు, బాలిబోయిన వెంకటరత్నంపై కేసు నమోదు చేయగా, వంకల అప్పలనాయుడు ఫిర్యాదు మేరకు చప్పగడ్డి అర్జున్‌, చప్పగడ్డ అప్పలనాయుడు, దేముళ్లునాయుడు, జొన్నపల్లి వెంకటరమణ, మజ్జి రమణ, ఎరుకునాయుడు, అప్పలస్వామి తదితర 12 మందిపై కేసు నమోదు చేశామన్నారు. గాయపడిన వారిని చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

తెలుగులో టాప్ కామెడీ షోగా దూసుకెళ్తోన్న జబర్దస్త్

హీరోయిన్ హేమలత రెడ్డికి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు

బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments