Webdunia - Bharat's app for daily news and videos

Install App

హింసకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తాం : అమిత్ షా

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (08:41 IST)
బిహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హింసకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా బిహార్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, బిహార్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, హింసతు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామని తెలిపారు.
 
ఆయన ఆదివారం బిహార్‌లో పర్యటించారు. నవాదాలో జరిగిన ఓ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తూ, 'అశోకచక్రవర్తి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నేను సాసారామ్‌ వెళ్లాలి. కానీ అక్కడ మనుషులు చనిపోతున్నారు. తుపాకులు మోగుతున్నాయి. అందుకే వెళ్లలేకపోయా. ఇందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నా, మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీసి సరిచేస్తాం' అని పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా నీతీశ్‌కుమార్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతి, అరాచకాలకు మారుపేరైన ఈ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని అన్నారు. బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలనూ తామే గెలుచుకుంటామని ఆయన జోస్యం చెప్పారు. తన తనయుడు తేజస్వీ యాదవ్‌ను బిహార్‌ సీఎంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చూడాలనుకుంటున్నారని, అలాగే నీతీశ్‌ కూడా దేశ ప్రధాని అవుతానన్న తప్పుడు భావనలో ఉన్నారని.. వీరిద్దరి కలలూ నెరవేరవని అమిత్‌ షా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments