Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు చికెన్ పకోడి తినలేదనీ ప్రియుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (14:27 IST)
తాను ఎంతో ఇష్టంగా తెచ్చిన ప్రియురాలు చికెన్ పకోడి తినక పోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుడివాడ, ధనియాల పేటకు చెందిన తెర్లి శ్రీను (25) అదే ప్రాంతానికి చెందిన వివాహితతో కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీను, ఆమె ఈనెల 19న మచిలీపట్నం వెళ్లివచ్చారు. అక్కడి నుంచి వస్తూ శ్రీను మద్యం, కోడిపకోడి తెచ్చుకున్నాడు. 
 
ఆ రోజు రాత్రిపూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు. దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆమె తన పాపను స్కూలు వద్ద దించి వచ్చే సమయానికి శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments