Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌వి తప్పుడు లెక్కలు.. అంతా ప్రచార ఆర్భాటం కోసమే-ఇండియన్ ఆర్మీ

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (14:05 IST)
సరిహద్దుల వద్ద భారత్-పాకిస్థాన్‌ సైన్యం నువ్వా నేనా అని పోటీ పడుతోంది. కాల్పుల ఉల్లంఘన కారణంగా పాకిస్థాన్ ఆర్మీ చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.


ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి ఆరుగురు భారత జవాన్లను హతమార్చామని పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించింది. అయితే పాకిస్థాన్ ఆర్మీ చేసిన ప్రకటనను భారత్ తిప్పికొడుతూ స్పందించింది. 
 
పాకిస్థాన్ కాల్పుల్లో ఒకరు మాత్రమే మరణించారని, ఆరుగురు కానేకాదని స్పష్టం చేసింది. నలుగురు మాత్రం గాయాలతో తప్పించుకున్నారని తెలిపింది. ఆరుగురు భారత జవాన్లను హతమార్చామన్న పాక్ ప్రకటనలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. 
 
ప్రచార ఆర్భాటం కోసం పాకిస్థాన్ పాకులాడుతోందని.. భారత సైనికులను చంపేశామని పాకిస్థాన్ చేసిన ప్రకటన కేవలం డ్రామా మాత్రమేనని పేర్కొంది. తాము పాక్ ఆర్మీలా మృతుల సంఖ్యను దాచుకోబోమని, ఉన్నది ఉన్నట్టు చెబుతామని భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది.
 
అంతకుముందు, పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ఒక ట్వీట్‌లో, సరిహద్దు కాల్పుల సమయంలో ఒక అధికారి సహా ఆరుగురు భారతీయ సైనికులు మరణించారని పేర్కొన్నారు. ఎల్ఓసి వెంట తట్టా పానీ సెక్టార్లో భారత సిఎఫ్వి (కాల్పుల విరమణ ఉల్లంఘన) కు పాకిస్తాన్ సైన్యం ధీటుగా స్పందించింది. ఆరుగురు సైనికులను హతమార్చినట్లు తెలిపారు.
 
కానీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం, భారత సైనికుల ప్రాణనష్టం జరిగిందని తప్పుడు సంఖ్యను చెప్పడమంతా పాకిస్థాన్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకేనని భారత ఆర్మీ తేల్చి చెప్పేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments