Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి ఎన్నికల్లో ఉద్రిక్తత - రెండో రోజూ వాయిదా

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (13:04 IST)
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తొలి రోజున ఎన్నిక జరుగకుండా అడ్డుకున్న అధికార వైకాపా నేతలు.. రెండో రోజైన మంగళవారం కూడా ఈ ఎన్నిక జరుగకుండా అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్ ఎన్నిక మరోమారు వాయిదాపడింది. దీంతో మున్సిపల్ కార్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి వాయిదా వేశారు. 
 
ఈ ఎన్నికల్లో అధికార వైకాపా సభ్యుల కంటే ప్రతిపక్ష టీడీపీకి ఒక్క సభ్యుడు అదనంగా ఉన్నారు. దీంతో ఛైర్మన్ గిరి టీడీపీకి దక్కుంది. అలా కాకుండా ఉండేందుకు అధికార పార్టీ నేతలు ఎన్నిక జరుగకుండా అడ్డుకుంటున్నారు. ఎన్నికను ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించి ఛైర్మన్‌ను ఎన్నుకోవాలంటూ కోరారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు వైకాపా నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేశ్‌ల కన్నుసన్నల్లో వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ ఎన్నిక సక్రమంగా జరుగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments