Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనకు ఇబ్బంది.. అందుకే ఎన్టీఆర్‌ను పక్కనబెట్టేశారు.. కొడాలి నాని

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (14:29 IST)
ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌కు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో.. ఎన్టీఆర్‌ను పక్కనబెట్టేశారని ఏపీ మంత్రి కొడాలి నాని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయనే భావనతో 2009 ఎన్నికల్లో ఆయన చేత చంద్రబాబు ప్రచారం చేయించారని కొడాలి నాని చెప్పారు. 
 
వాస్తవానికి లోకేశ్‌ది కార్పొరేటర్ స్థాయి కూడా కాదని ఎద్దేవా చేశారు. కుమారుడు అయినందువల్లే నారా లోకేశ్‌ని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవిని కట్టబెట్టారని నాని మండిపడ్డారు. టీడీపీకి లోకేశ్ గుదిబండగా మారారని అన్నారు. దివంగత ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, చంద్రబాబులా ఆయన ఏనాడూ సొల్లు కబుర్లు చెప్పలేదని తెలిపారు.
 
నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. టీడీపీకి ప్రజాధరణ తగ్గడానికి నారా లోకేష్, చంద్రబాబే  కారణమని ఆరోపించారు. ఇకనైనా పార్టీ పగ్గాలు మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే టీడీపీ ఉనికి, అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 
 
ఏపీ మాజీ మంత్రి లోకేశ్ దద్దమ్మ కాబట్టే అడ్డదారిలో పదవీ కట్టబెట్టారని విమర్శించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments