Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్‌కు మార్చండి.. వంశీ పిటిషన్

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (10:59 IST)
విజయవాడ గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలులో భయంపట్టుకుంది. దీంతో తనను మరో బ్యారక్‌లోకి మార్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
మరోవైపు, తన కిడ్నాప్ కేసులో సత్యవర్థన్ ఎస్సీఎస్టీ కోర్టు మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. దీన్ని విజయవాడ ఎస్పీకి కోర్టు అందజేసింది. తన కిడ్నాప్ ఎలా జరిగిందన్న దానిపై సత్యవర్థన్ పూసగుచ్చినట్టు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్థన్ స్టేట్మెంట్ కావాలని కోరుతూ పోలీసులు కోర్టును కోరారు. వారి విన్నపం మేరకు కోర్టు స్టేట్మెంట్‌ను అందజేసింది. 
 
మరోవైపు, ఈ కేసులో ఏ4గా వీర్రాజు, ఏ10గా ఉన్న వంశీ బాబు అనే నిందితులను విచారించేందుకు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను వేరే బ్యారక్‍‌కు మార్చాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు మంగళవారం తీర్పును వెలువరించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments