Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ దెబ్బకు కన్నుమూసిన కాకినాడ వైకాపా అధ్యక్షుడు

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2020 (16:17 IST)
కరోనా వైరస్ సోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నేత కన్నుమూశారు. ఆయన పేరు ఫ్రూటీ కుమార్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉంటున్నారు. ఈయన కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈయనకు ఇటీవల కరోనా వైరస్ సోకడంతో విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నారు. పరిస్థితి విషమించి, పలు అవయవాలు దెబ్బతినడంతో, ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
 
ఇటీవలే ఫ్రూటీ కుమార్ భార్య చంద్రకళా దీప్తికి ఫోన్ చేసిన వైఎస్ జగన్, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఫ్రూటీ కుమార్ మరణంతో కాకినాడ వైసీపీ నేతల్లో విషాదం నెలకొంది. 
 
ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారని పలువురు నేతలు కొనియాడారు. ఫ్రూటీ కుమార్ మృతిపట్ల మంత్రులు, జిల్లా నేతలు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 
మరోవైపు, దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 45,674 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,07,754 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 49,082 మంది కోలుకున్నారు.
 
అలాగే గడచిన 24 గంట‌ల సమయంలో 559 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,26,121 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 78,68,968 మంది కోలుకున్నారు. 5,12,665 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,77,36,791 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,94,487 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,440 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,481 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,50,331 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,29,064 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1377 కి చేరింది. 
 
ప్రస్తుతం 19,890 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 17,135 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 278 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 112 కేసులు నిర్ధారణ అయ్యాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments