Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ క్యానుతో తిరుపతిలో జనసేనపార్టీ నేత.. ఎందుకు వచ్చాడంటే?

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (16:28 IST)
క్రిష్ణాజిల్లా గుడివాడ క్యాసినో వ్యవహారం కాస్త పెద్ద దుమారాన్నే రేపుతోంది. సాక్షాత్తు మంత్రి కొడాలి నానికి చెందిన కళ్యాణ మండపంలోనే క్యాసినో జరిగిందని, పేకాట ఆడుతూ అసభ్యంగా ప్రవర్తించారని టిడిపి చెబుతోంది. నిజ నిర్థారణ కమిటీ నిన్న గుడివాడకు వెళ్ళే సమయంలో పెద్ద దుమారమే రేగింది.

 
టిడిపి నేతలతో పాటు వైసిపి నేతలు పరస్పరం ఆందోళనకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్ళదాడికి దిగారు. ఇది కాస్త రాష్ట్రవ్యాప్తంగా రచ్చకు కారణమైంది. అసలు తనకు చెందిన కళ్యాణ మండపంలో క్యాసినో ఆడినట్లు నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానన్నారు మంత్రి కొడాలి నాని.

 
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానన్నారు. దీంతో తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు ప్రెస్ క్లబ్‌లో ఐదు లీటర్ల పెట్రోల్ క్యాన్‌తో చేరుకున్నారు. ఇదిగో ఆధారాలు అంటూ జగన్, మంత్రి పేరును ఉచ్చరిస్తూ పాటలు పాడుతూ కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలను బయటపెట్టారు. 

 
ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకో కొడాలి నాని. ఇదిగో పెట్రోల్. ఆత్మహత్య చేసుకో అన్నారు జనసేన పార్టీ నేతలు. మంత్రి చెప్పే మాటలన్నీ అబద్ధాలేనంటున్నారు జనసేన పార్టీ నేతలు. క్యాసినో వ్యవహారం కాస్త ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments