Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో నకిలీ ప్రవేశ టిక్కెట్ల దందా.. ఎస్.పి.ఎఫ్.కానిస్టేబుల్‌పై కేసు

Advertiesment
Tirumala
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన నకిలీ టిక్కెట్ల దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. భద్రతా విభాగంలో విధులు నిర్వహించే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ ఈ నకిలీ టిక్కెట్ దందాను సాగిస్తున్నట్టు బహిర్గతమైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు శ్రీవారి భక్తులకు ఈ టిక్కెట్లను రూ.21 వేలకు విక్రయించి క్యాష్ చేసుకున్నట్టు తేలింది. 
 
వాస్తవానికి ఈ టికెట్ ధర రూ.300 మాత్రమే. కానీ, ఈ టిక్కెట్‌ను ఆ కానిస్టేబుల్ రూ.21 వేలకు విక్రయించారు. ఈ టిక్కెట్లను స్కానింగ్, టిక్కెట్ కౌంటర్ వద్ద పనిచేసే మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి కానిస్టేబుల్ ఈ దందాను కొనసాగిస్తున్నట్టు తేలింది. దీంతో కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోయ‌లో శ‌వం... తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ హ‌త్య‌!