Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటు జగన్ - ఇటు కెసిఆర్ ఇరుక్కున్న బాబు... ఎలా?

తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకున పడేశారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని రైతుకు ఉచితంగా అందించే రైతుబంధు పథకానికి తెలంగాణా ప్

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (12:33 IST)
తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకున పడేశారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని రైతుకు ఉచితంగా అందించే రైతుబంధు పథకానికి తెలంగాణా ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రబీలో రూ.4 వేలు, ఖరీఫ్‌‌లో రూ.4 వేలు ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు. దీనివల్ల 58 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతోందని వెల్లడించారు. 
 
వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి యేడాది క్రితం ప్రకటించిన నవరత్నాలు పథకాల్లోనూ ఇదే ఉంది. పంటల సాగు కోసం యేడాదికి రూ.12 వేలు ఇస్తామని జగన్ ప్రకటించారు. పాదయాత్రలో ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇంతలోనే కెసిఆర్ పథకాన్ని ఆచరణలో పెట్టారు. వాస్తవంగా రైతులు పంటల సాగుకు పెట్టుబడులు దొరక్క అప్పుల పాలవుతున్నారు. స్వామినాథన్ వంటి వాళ్ళు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యవసాయానికి పెట్టుబడులు ప్రభుత్వమే సమకూర్చాలని సిఫార్సు చేశారు. దీన్ని కెసిఆర్ ఆచరణలోకి తేవడం అభినందించాల్సిన విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఎంతవరకు సక్రమంగా అమలు చేస్తారనేది తరువాత అంశం.
 
ఇప్పుడు చంద్రబాబుకు సమస్య వచ్చిపడింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ రైతులకూ ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందట. రుణమాఫీ అనేది ఒక యేడాదికి సంబంధించినది. ఐతే రైతు బంధు అనేది రైతుల వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచేది. మరి చంద్రబాబు నాయుడు ఈ పథకంపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments