Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ చేసి అతిపెద్ద తప్పు అదే.. లేకుంటేనా... ఉండవల్లి అరుణ్ కుమార్

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్లో అతిపెద్ద తప్పుడు నిర్ణయం రాజధాని అమరావతిని మార్చాలన్నదేనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత దాన్ని మరో ప్రాంతానికి మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉండివుండొచ్చన్నారు. అది చాలా పెద్ద తప్పుడు నిర్ణయమని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో గ్రాఫిక్స్‌తో మభ్యపెట్టారని ఆరోపించారు. కానీ, అమరావతిలో అనేక భవనాల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేశారని ఉండవల్లి గుర్తుచేశారు. 
 
చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తికావాలంటే 400 లేదా 500 సంవత్సరాలు పడుతుందన్నారు. అదేసమయంలో రాజధాని అమరావతిపై ఏపీ శాసనసభలో చర్చ చేపట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments