Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. 630 కొత్త కేసులు.. నలుగురు మృతి

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. 630 కొత్త కేసులు.. నలుగురు మృతి
, శనివారం, 5 డిశెంబరు 2020 (21:26 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ఏపీలో 8.71 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,71,305కి చేరింది. ఇందులో 8,58,115 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 6,166 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి.
 
ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,024కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే చిత్తూరులో 89, అనంతపురంలో 29, తూర్పుగోదావరి జిల్లాలో 64, గుంటూరులో 85, కడపలో 28, కృష్ణాలో 97, కర్నూలులో 05, నెల్లూరులో 32, ప్రకాశంలో 35, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 40, విజయనగరంలో 24, పశ్చిమ గోదావరిలో 90 కేసులు నమోదయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నీలియోన్ పాటకు చిందేసిన వధువు.. నెట్టింట వీడియో వైరల్ (Video)