Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (12:01 IST)
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం చాటపర్రు రోడ్డులో ఉన్న సూర్యనారాయణ రైస్ మిల్లు  గోడౌన్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వరదరాజులు ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.

కొత్తూరు ప్రాంతానికి చెందిన కుమార్ అనే వ్యక్తి ఈ గోడను అద్దెకు తీసుకొని నగరంలోని పలు ప్రాంతాలలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఈ గోడౌన్ కు చేర వేస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమాచారాన్ని సేకరించారు దీంతో ఆ గోడౌన్ పై అధికారులు దాడి చేశారు.

అక్కడ రేషన్ బియ్యాన్ని 25 కేజీలు పది కేజీల బస్తాలు గా నిర్వాహకుడు కుమార్ ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు వెంటనే అక్కడ ఉన్న 11 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.

కుమార్ వద్ద గుమాస్తాగా పని చేస్తున్న ఎనికేపల్లి రమేష్ అనే వ్యక్తి నీ అదుపులోకి తీసుకొని అతనిపై నిర్వాహకుడు కుమార్పై కేసు నమోదు చేశారు ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ విల్సన్ , రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments