Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్లకు నిప్పుపెట్టి.. యువకుల పైశాచికానందం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (15:12 IST)
హైదరాబాద్ నగరంలో కొంతమంది పోకిరీలు సభ్యసమాజం ఛీదరించుకునే పనులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. తాజాగా వీధుల్లో పార్క్ చేసివున్న కార్లకు నిప్పు పెట్టి సంతోషం పొందారు. ఫలితంగా ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువ చేసే కార్లు పూర్తిగా దగ్దమైపోయాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడా కమలానగర్‌లో ఓ కారును కొంతమంది పోకిరీల ముఠా తగులబెట్టింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. దీనిపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో హాస్టళ్లలో ఉంటున్న కొంతమంది పోకిరీలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని తేల్చారు. పగలంతా హాస్టల్లో ఉండడం.. రాత్రికాగానే వీధుల్లో జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడం లేదా కార్లకు నిప్పంటించి ఆనందపడటం వీరికి నిత్యకృత్యమైపోయింది. దీంతో ఈ పోకిరీల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments