Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంటే లేచి కూర్చొన్న మహిళ

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (14:36 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించే సంఘటన ఒకటి ఇటీవల చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఓ మహిళ అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో ఆమె కన్నుమూసిందని భావించిన.. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మరికొన్ని క్షణాల్లో అంత్యక్రియలు పూర్తిచేయాల్సివుండగా ఆ మహిళ అందరికీ షాకిస్తూ ఉన్నట్టుండి లేచి కూర్చొంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. అంత్యక్రియలకు హాజరైనవారంతా వచ్చి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగపూర్ గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన కనకమ్మ అనే మహిళ కొన్నేళ్ల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతుండేది. దీంతో ఆమెకు అత్యవసర చికిత్స అందించడం కోసం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 
 
ఇక చేసేది ఏమి లేక కుటుంబసభ్యులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆమె లేచి కూర్చుంది. దీనికి ఆమె కుటుంబసభ్యులు ఒకింత షాక్‌కు గురయ్యారు. కాగా మెరుగైన చికిత్స కోసం ఆమెను జగిత్యాలలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments