Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ నుంచి కోలుకున్న తల్లి.... ఇంట్లో అడుగుపెట్టొద్దంటూ కొడుకు హుకుం

Webdunia
శనివారం, 25 జులై 2020 (09:00 IST)
ఆ తల్లి కరోనా వైరస్ బారినపడింది. ఓ ప్రభుత్వ దావఖానాలో చికిత్స తీసుకున్న తర్వాత కోవిడ్ కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక గంపెడాశలతో ఇంటికి వచ్చింది. కానీ, కన్నబిడ్డతో పాటు.. కోడలు ఆమె ఆశలకు బ్రేక్ వేశారు. ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. అంతేనా.. ఏకంగా ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగరులో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక బీజేఆర్ నగర్‌కు చెందిన మహిళ (55)కు ఇటీవల కరోనా సోకడంతో చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆమె శుక్రవారం ఇంటికి చేరుకుంది. 
 
మహమ్మారిని జయించి ఇంటికొచ్చిన తల్లిని చూసిన ఆమె కొడుకు, కోడలు ఆప్యాయంగా పలకరించకపోగా, ఇంట్లోకి అడుగుపెట్టవద్దంటూ హుకుం జారీ చేశారు. అంతేకాదు, ఇంటిపైకప్పు రేకులను ధ్వంసం చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కొడుకు, కోడలు తీరుతో విస్తుపోయిన ఆమె రాత్రంతా ఇంటి ముందే గడిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments