Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతలో సెల్ఫీ పిచ్చి.. నదీ మధ్యలో ఫోజిచ్చిన అమ్మాయిలు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (23:28 IST)
Selfie
యువతలో సెల్ఫీ పిచ్చి మామూలుగా లేదు. కరోనా వచ్చినా.. ఎక్కడా తిరగొద్దని విన్నా ఓ యువత బృందం పిక్నిక్‌కు వెళ్లింది. అంతటితో ఆగకుండా.. సెల్ఫీలు తీసుకున్నారు. అదీ ఎక్కడ అంటే.. నదిలో. ఆ సెల్ఫీ పిచ్చి కాస్త ప్రాణాల వరకు తెచ్చింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో గల పెంచ్ నదిలో ఈ సంఘటన జరిగింది. 
 
సెల్ఫీ పిచ్చి బాగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు నదిలోకి దికి ఫోజులు పెట్టడం ప్రారంభించారు. అంతలోనే వరద పోటెత్తడంతో వాళ్లిద్దరూ చిక్కుకుపోయారు. దాదాపు ప్రాణాపాయం నుంచి వాళ్లను అతి కష్టం మీదగానీ పోలీసులు కాపాడారు. 
 
ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ అమ్మాయిలంతా నదికి సమీపంగా ఉండే బేలాఖేడికి చెందినవాళ్లుగా పోలీసులు గుర్తించారు. నదిలోని రాళ్లపై నిలబడి సెల్ఫీలు దిగుతుండగా, వరద పోటెత్తి వాళ్లు చిక్కుపోవడంతో బయటున్న స్నేహితురాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
వెంటనే స్పందించిన పోలీసులు.. గజ ఈతగాళ్లతో సహా పెంచ్ నది వద్దకు చేరుకున్నారు. తాడు సాయంతో అతికష్టం మీద యువతులిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. టెన్షన్ తీరిన తర్వాత అమ్మాయిలందరూ పోలీసులకు థ్యాంక్స్ చెప్పగా, ఇంకోసారి ఇలాంటి దుస్సాహసాలు చేయొద్దని పోలీసులు హితవు చెప్పి వాళ్లను పంపించేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments