Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

చికెన్ తిని అపస్మారక స్థితిలో ఇద్దరు మహిళలు.. ఏమైంది?

Advertiesment
చికెన్ తిని అపస్మారక స్థితిలో ఇద్దరు మహిళలు.. ఏమైంది?
, గురువారం, 23 జులై 2020 (11:42 IST)
మాంసాహారం తీసుకున్న ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. చికెన్‌ కూర తినడం వల్లే వారు అనారోగ్యానికి కారణమయ్యారని వైద్యులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చందానగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన టైలరింగ్‌ పని చేసే గంగాధర్‌ వద్ద ఇద్దరు పని చేస్తున్నారు. వారు మంగళవారం మధ్యాహ్నం చికెన్‌ తెచ్చి ఓ మహిళకు ఇచ్చి వండమని చెప్పారు. 
 
వండిన చికెన్‌లో కొంత భాగాన్ని ఆ మహిళకు ఇచ్చారు. ఆమె తన కూతురు (15)తో పాటు కొడుకుకూ చికెన్‌ పెట్టి, తానూ తింది. సాయంత్రం భర్త వచ్చిచూడగా అపస్మారక స్థితిలో భార్య, కూతురు, కొడుకు పడివున్నారు. దీంతో చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపారు.
 
చికెన్ కూర తిన్న తర్వాత ఇద్దరు మహిళలు మత్తులోకి జారుకున్నారని తెలిసింది. భర్త ఇంటికి వచ్చి చూసే సమయంలో స్పృహలో లేరని ఇరుగుపొరుగువారి సహాయంతో ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఫిర్యాదు ఆధారంగా, చందానగర్ పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఆ మహిళలపై లైంగిక వేధింపులు జరిగివుంటాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వైద్య పరీక్షల్లో వారిపై లైంగిక వేధింపుల జాడలు లేవని వైద్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. జీతాలను ప్రతీయేటా పెంచుతారట..