Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను నీటి సంపులో పడేసి చంపేసిన తల్లి...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (10:25 IST)
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అక్కసుతో ఓ కసాయి తల్లి కన్నబిడ్డను నీటి సంపులో పడేసి చంపేసింది. ఆ తర్వాత ఆ నేరాన్ని కట్టుకున్న భర్తపై మోపేందుకు ప్రయత్నించింది. కానీ, పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెల్లడికావడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది.
 
హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ క్రైమ్ న్యూస్ వివరాలను పరిశీలిస్తే, మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మూక్రమ్ అనే వ్యక్తి ఉన్నారు. ఈయనకు వివాహమై ముగ్గురు ఆడపిల్లలతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. 
 
ఈ క్రమంలో మూక్రమ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో భర్తపై ఉన్న కోపంతో మూడు సంవత్సరాల కొడుకు రెహాన్‌ను నీటిసంపులో పడేసి చంపేసింది. 
 
ఈ నేరాన్ని తన భర్తే చేశాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. దీంతో మాక్రమ్ భార్యను అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments