Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను నీటి సంపులో పడేసి చంపేసిన తల్లి...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (10:25 IST)
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అక్కసుతో ఓ కసాయి తల్లి కన్నబిడ్డను నీటి సంపులో పడేసి చంపేసింది. ఆ తర్వాత ఆ నేరాన్ని కట్టుకున్న భర్తపై మోపేందుకు ప్రయత్నించింది. కానీ, పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెల్లడికావడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది.
 
హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ క్రైమ్ న్యూస్ వివరాలను పరిశీలిస్తే, మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మూక్రమ్ అనే వ్యక్తి ఉన్నారు. ఈయనకు వివాహమై ముగ్గురు ఆడపిల్లలతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. 
 
ఈ క్రమంలో మూక్రమ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో భర్తపై ఉన్న కోపంతో మూడు సంవత్సరాల కొడుకు రెహాన్‌ను నీటిసంపులో పడేసి చంపేసింది. 
 
ఈ నేరాన్ని తన భర్తే చేశాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. దీంతో మాక్రమ్ భార్యను అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments