Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను నీటి సంపులో పడేసి చంపేసిన తల్లి...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (10:25 IST)
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అక్కసుతో ఓ కసాయి తల్లి కన్నబిడ్డను నీటి సంపులో పడేసి చంపేసింది. ఆ తర్వాత ఆ నేరాన్ని కట్టుకున్న భర్తపై మోపేందుకు ప్రయత్నించింది. కానీ, పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెల్లడికావడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది.
 
హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ క్రైమ్ న్యూస్ వివరాలను పరిశీలిస్తే, మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మూక్రమ్ అనే వ్యక్తి ఉన్నారు. ఈయనకు వివాహమై ముగ్గురు ఆడపిల్లలతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. 
 
ఈ క్రమంలో మూక్రమ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో భర్తపై ఉన్న కోపంతో మూడు సంవత్సరాల కొడుకు రెహాన్‌ను నీటిసంపులో పడేసి చంపేసింది. 
 
ఈ నేరాన్ని తన భర్తే చేశాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. దీంతో మాక్రమ్ భార్యను అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments