Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ మంత్రి... క్షతగాత్రుడుకు ప్రాణంపోశారు...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (14:13 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మిక శాఖామంత్రి సీహెచ్. మల్లారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ సైకిలిస్టును చూసి చలించిపోయారు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కారులోనే స్వయంగా ఆస్పత్రికి తరలించి, దగ్గరుండి వైద్య సేవలు చేయించారు. ఈ విషయంలో మంత్రి చూపిన ఔదార్యం, చొరవను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని బాలా నగర్ జంక్షన్ వద్ద సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత లారీ వెనుక చక్రం ఓ కాలిపై ఎక్కడంతో నుజ్జు నుజ్జు అయింది. 
 
ఆ వెనుకనే మంత్రి కాన్వాయ్ వచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి రోడ్డుపై జీవచ్ఛవంలా పడివున్న క్షతగాత్రుడుని చూసి మంచి మల్లారెడ్డి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి.. గాయపడిన వ్యక్తి పరిస్థితిని గమనించి ఎస్కార్ట్‌ వాహనంలో అతడిని నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి వైద్యం చేయించారు. బాధితుడి ప్రాణానికి అపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని బాలస్వామి(55) గుర్తించగా, తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్నట్టు వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments