Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 2న పెళ్లైతే ఇపుడు మూడు నెలల గర్భం ఎలావస్తుంది.. అందుకే చంపేశా...

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (11:05 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ దారుణం జరిగింది. మే నెల రెండో తేదీన వివాహం చేసుకున్న ఓ యువతి ఇపుడు మూడు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీన్ని జీర్ణించుకోలేని భర్త ఆమెన పాశవికంగా చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణానికి చెందిన మహబూబ్ అనే యువకుడు అదే ప్రాంతంలో బీరువాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఆదోని మండలానికి చెందిన రజియాబాను అనే యువతినిచ్చి గత మే నెల రెండో తేదీన వివాహం చేశారు. 
 
అయితే, ఇటీవల రజియాబాను అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. రజియాబాను మూడు నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. 
 
అప్పటి నుంచి నిత్యం వేధిస్తూ వచ్చిన మహబూబ్... సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్య గొంతు నులిపి హత్య చేశాడు. ఆపై తన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, మహబూబ్‌ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రజియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం