Webdunia - Bharat's app for daily news and videos

Install App

2004కి ముందు జగన్ ఆస్తి ఎంత?: వర్ల రామయ్య

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:06 IST)
మూడు రాజధానులను ప్రకటించడం ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయమని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. అమరావతిని తరలించే శక్తి జగన్ కు లేదని చెప్పారు. అమరావతి రైతులు ఉద్యమాన్ని ప్రారంభించి ఏడాది కావస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
 
జగన్ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం జగన్ అని అన్నారు. తండ్రి వైయస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారని చెప్పారు. 2004కి ముందు జగన్ ఆస్తి ఎంత? ఇప్పుడు ఆయన ఆస్తి ఎంత? అని ప్రశ్నించారు.
 
అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని వర్ల అన్నారు. జగన్ సీఎం అయిన ఏడాదిన్నరలో రాష్ట్రం అప్పులపాలు అయిందని చెప్పారు.

వరుస తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments