Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కొండంత వర్షం : నీట మునిగిన తిరుపతి పట్టణం

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (07:16 IST)
తిరుపతి పట్టణం నీట మునిగింది. తిరుమలగిరుల్లో కొండత వర్షం కుంభవృష్టి కురిసింది. దీంతో తిరుపతి పట్టణం నీట మునిగింది. ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. రోడ్లపై ప్రవహిస్తున్న వరదకు కార్లు, బైకులు నీటిలో మునిగిపోయాయి. 
 
ఈ వరద ప్రవాహంపై తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు స్పందించారు. తిరుపతిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ ఏ ఒక్కరూ బయటకు రావొద్దంటూ కోరారు. ముఖ్యంగా తిరుపతి నుంచి నెల్లూరుల, చెన్నై వేళ్ళేవారు పుత్తూరు, నాగలాపురం, సత్యవేడు, తడ మీదుగా వెళ్లాలని సూచించారు. 
 
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి పట్టణ పురపాలక సంస్థ కార్యాలయంలో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజల సహాయం కోసం 0877 2256766 అనే ఫోన్ నంబరురో సంప్రదించాలని కోరారు. 
 
అటు తిరుమల ఘాట్ రోడ్డుపై 13 చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు. అలిపిరి కాలినడక మార్గాన్ని కూడా మూసివేశారు. దీంతో తిరుమల, తిరుపతి ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments