తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, ఘాట్ రోడ్లు క్లోజ్

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (21:22 IST)
ఎపిని వర్షాలు వణికిస్తున్నాయి. తిరుపతి, తిరుమలను వర్షం ముంచెత్తుతోంది. దీంతో టిటిడి ఘాట్ రోడ్లతో పాటు కాలినడక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఘాట్ రోడ్ల నుంచి కొండచరియలు విరిగి పడుతుండడంతో ఘాట్ రోడ్లను ఉన్నట్లుండి మూసివేసింది. 

గత రెండురోజుల నుంచి కాలినడక మార్గాన్ని టిటిడి మూసేసి వుంచింది. వర్షం కారణంగా వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం.. కాలినడక మార్గంలోకి వర్షపు నీరు రావడంతో  భక్తులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున రెండురోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
 
అయితే వర్షం ఏమాత్రం తగ్గకపోవడంతో మరో రెండు రోజుల పాటు కాలినడక మార్గాలను మూసివేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం రెండు కాలినడ మార్గాలు తిరుమలకు ఉన్నాయి. ఒకటి అలిపిరి కాలినడక మార్గం, మరొకటి శ్రీవారి మెట్టు మార్గం. రెండు మార్గాలను రెండురోజుల పాటు మూసే ఉంచనున్నారు.
అలాగే ఘాట్ రోడ్లను కూడా ఉన్నట్లుండి టిటిడి మూసివేసింది. వర్షం అలాగే కొనసాగితే ఘాట్ రోడ్లను కూడా తెరిచే అవకాశం కనిపించడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments