Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, ఘాట్ రోడ్లు క్లోజ్

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (21:22 IST)
ఎపిని వర్షాలు వణికిస్తున్నాయి. తిరుపతి, తిరుమలను వర్షం ముంచెత్తుతోంది. దీంతో టిటిడి ఘాట్ రోడ్లతో పాటు కాలినడక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఘాట్ రోడ్ల నుంచి కొండచరియలు విరిగి పడుతుండడంతో ఘాట్ రోడ్లను ఉన్నట్లుండి మూసివేసింది. 

గత రెండురోజుల నుంచి కాలినడక మార్గాన్ని టిటిడి మూసేసి వుంచింది. వర్షం కారణంగా వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం.. కాలినడక మార్గంలోకి వర్షపు నీరు రావడంతో  భక్తులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున రెండురోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
 
అయితే వర్షం ఏమాత్రం తగ్గకపోవడంతో మరో రెండు రోజుల పాటు కాలినడక మార్గాలను మూసివేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం రెండు కాలినడ మార్గాలు తిరుమలకు ఉన్నాయి. ఒకటి అలిపిరి కాలినడక మార్గం, మరొకటి శ్రీవారి మెట్టు మార్గం. రెండు మార్గాలను రెండురోజుల పాటు మూసే ఉంచనున్నారు.
అలాగే ఘాట్ రోడ్లను కూడా ఉన్నట్లుండి టిటిడి మూసివేసింది. వర్షం అలాగే కొనసాగితే ఘాట్ రోడ్లను కూడా తెరిచే అవకాశం కనిపించడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments