Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌ష్ట‌ప‌డినా గుర్తింపు లేద‌ని టీడీపీకి హైమావ‌తి రాజీనామా

Webdunia
శనివారం, 17 జులై 2021 (14:43 IST)
ఏపీలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బలు త‌గులుతూనే ఉన్నాయి.  ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి త‌న రాజీనామా ప్ర‌క‌టించారు. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ శోభా హైమావతి ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. శోభా హైమావతి గతంలో ఎస్. కోట ఎమ్మెల్యేగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు.
 
శోభా హైమావ‌తి కుమార్తె  స్వాతి రాణి ఇప్ప‌టికే వైసీపీలో చురుకుగా ప‌నిచేస్తున్నారు. ఇక త‌ల్లి హైమావ‌తి ప‌యనం కూడా అటే అని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. హైమావ‌తి ఎస్.కోట నుంచి గ‌తంలో ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. 1999లో ఆమె శృంగ‌వ‌ర‌పుకోట నుంచి టిడిపి అభ్య‌ర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ కు చెందిన గంధేశ్వ‌ర‌స్వామిని ఓడించారు.

త‌రువాత 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమె కాంగ్రెస్ కు చెందిన కుంభా ర‌విబాబుపై ఓడిపోయారు. ఆ త‌రువాత 2009,2014, 2019 ఎన్నిక‌ల్లో ఆమెకు టిడిపి టిక్కెట్ ఇవ్వ‌లేదు. పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలిగా ఆమెను చంద్ర‌బాబు నియ‌మించారు. త‌రువాత ఆమె పార్టీలో పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments