Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదుడు రెడ్డి వ‌ల్లే పెట్రోల్ ధ‌ర శ‌త‌కం...లోకేష్ ట్వీట్!

Webdunia
శనివారం, 17 జులై 2021 (14:35 IST)
ఏపీలో ప్రజల్ని జగన్ పీల్చి పిప్పి చేస్తున్నార‌ని, ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయ‌ని టీడీపీ నేత నారా లోకేష్ విమ‌ర్శించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చని నీతి కబుర్లు చెప్పిన బాదుడు రెడ్డి... ఇపుడు త‌నే అధికంగా ప‌న్నులు వేస్తున్నార‌ని లోకేష్ ఆరోపించారు.

ఇండియన్ పెట్రోల్ లీగ్‍లో రికార్డుల మోత మోగిస్తూ, పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి.... బాదుడు రెడ్డి అనే పేరును సార్దకం చేసుకున్నార‌ని ఎద్దేవా చేశారు. 31 శాతం వ్యాట్+లీటర్‍కు రూ.4 అదనపు వ్యాట్+ లీటర్‍కు రూ.1 రోడ్డు అభివృద్ధి సుంకం అన్నీ వెరసి... ప్రజలపై బాదుడు రెడ్డి భారం లీటర్‍కు 30 రూపాయలు అని లెక్క తేల్చారు లోకేష్.

ప్రతిపక్షంలో ఉండ‌గా, పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చన్న బాదుడు రెడ్డి, ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదు? అని ప్ర‌శ్నించారు.  ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అంటూ బోర్డు పెట్టారంటే, మీ దోపిడీ ఏ రెంజ్‍లో ఉందో అర్థమవుతోంది... ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్న మాటకు కట్టుబడి రాష్ట్ర పన్నుల భారాన్ని తగ్గించి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అందించాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments