తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వడగండ్ల వాన.. అలెర్ట్

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:53 IST)
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో గాలివాన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు హైదరాబాద్ ఐఎండీ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో తమిళనాడులోని పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఏపీలోనూ గాలివాన, ఈదురు గాలులతో వర్షం పడుతుందని పేర్కొంది. 
 
వచ్చే 5 రోజులలో కేరళ, తమిళనాడు-పుదుచ్చేరి-కరైకల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 50-60 కిమీ ఉండొచ్చని, వడగళ్ల వాన కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
 
దక్షిణాదితోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకూ వర్షం, వడగండ్ల వానల హెచ్చరికలు జారీ అయ్యాయి. అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగళ్ల వానలు కురుస్తాయి ఏప్రిల్ 18 నుంచి 22 వరకు సర్వత్రా అప్రమత్తత అవసరమని, ఇళ్లు ధ్వంసం అయ్యేంత స్థాయిలో భారీ వడగండ్లు పడతాయని ఈ మేరకు ఐఎండీ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments